ఆరోగ్య భారతిసంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని మతు సంగెం, పెట్ సంగెంగ్రామంలో కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కే.రాంసింగ్, ఎస్ వి శ్రీజ హాస్పిటల్ గాందారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరం అయినా వ్యక్తులకు ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్  డాక్టర్ రాంసింగ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలిఅంటే మంచిఅలవాట్లు ఉండాలని వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగ ఉంటూ ఆరోగ్యన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మాతుసంగెం సర్పంచ్ కమ్మరి భాస్కర్, ఉప సర్పంచ్ సంగరావ్  తదితరులు పాల్గొన్నారు.

Spread the love