గొర్రెల కాపరుల సహకార సంఘం చైర్మన్ కు అభినందనలు

నవతెలంగాణ రాయపోల్ : గొర్రెల కాపరుల సహకార సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ గా మరోసారి నియమితులైన పోచబోయిన శ్రీహరి యాదవ్ ను ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగిందని ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు,సామాజిక ప్రజా సేవకురాలు సుల్తాన ఉమర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోచబోయిన శ్రీధర్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీహరి యాదవ్ సెప్టెంబర్ లో 27న తన పదవి కాలం ముగిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గొర్రెల కాపరుల సహకార సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులుగా పోచబోయిన శ్రీహరి యాదవ్ ను 2024 సెప్టెంబర్ వరకు మరో ఏడాది పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోచబోయిన శ్రీహరి యాదవ్ కు మరోసారి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంతో అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను యాదవులందరికి అందజేసి వారి సంక్షేమం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టరాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love