నవతెలంగాణ – హైదరాబాద్: నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం 5రోజులుగా గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ను హరీశ్ పరామర్శించారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకుంటోంది. 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది? రేవంత్ రెడ్డి, కోదండరాం సమాధానం చెప్పాలని ఆయన అని డిమాండ్ చేశారు.