రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

– రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి
నవతెలంగాణ-వీణవంక
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని పీసీసీ సభ్యుడు కర్ర భగవాన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అతి పిన్న వయస్సులోనే ఆయన దేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టి అనేక సంస్కరణలకు ఆధ్యం పోశారని, నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ సాహెబ్  హుస్సెన్, గంగాడి రాజిరెడ్డి, ఒడ్డెపల్లి  కొమురయ్య, చదువు జైపాల్ రెడ్డి, మండల రాజయ్య, మందల అనిల్ రెడ్డి, సాయిలు, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love