బెల్ట్ షాపులను మూసివేయాలి: కాంగ్రెస్ పార్టీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో టెండర్ల ద్వారా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను మూసివేయాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వీడీసీ అధ్యక్షునికి, పాలకవర్గానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించడం కారణంగా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు మద్యానికి బానిసై రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రజల ప్రాణాలు, రోడ్డున పడుతున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అలాగే వీడీసీ ఆధ్వర్యంలో జమ, ఖర్చుల వివరాలు తెలపాలని సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love