– చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – చందుర్తి
శాంతిభద్రత సంరక్షణలో పోలీసులకు సహకరించాలని రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు అనంతరం సిబ్బందితో మాట్లాడరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తల్లితిన పోలీసులకు సమాచారం అందించాలని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని దీంతో గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టచని అన్నారు ఆయన వెంట ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.