సీపీఐ(ఎం) ప్రచారం ముమ్మరం

నవతెలంగాణ – అశ్వారావుపేట: ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,అశ్వారావుపేట నియోజక వర్గం ఎన్నికల ఇంచార్జి కొక్కెరపాటి పుల్లయ్య నేతృత్వం ప్రచారం ముమ్మరం చేసారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఈ నెల 25,37 తేదీల్లో జరిగే అభ్యర్ధి ప్రచారం, బైక్ ర్యాలీ లకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మండలంలోని అచ్యుతాపురం లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, పేరాయిగూడెం లో జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి చిరంజీవి, వినాయకపురం లో మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్ లు విస్త్రుత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఐద్వా నాయకురాలు తగరం నిర్మల, ముళ్ళ గిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు,నారం అప్పారావు, తగరం జగన్నాధం తదితరులు ఉన్నారు.
Spread the love