విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి..

నవతెలంగాణ- వలిగొండ: వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామం పరిధిలోని వెంకన్న భావిగూడెంకి చెందిన రైతు నల్ల రాజు రెడ్డి యొక్క పాడి ఆవు విద్యుత్ షాక్ తో మృతి చెందడం జరిగింది. రోజు మాదిరిగానే ఆవును కట్టేసి ఇంటికి వెళ్లారు. సోమవారం రోజు రాత్రి వారు కట్టిన తాడును తెంచుకొని ప్రమాదవశాత్తు విద్యుత్ కనెక్షన్ కలిగిన ట్రాన్స్ఫారం వద్ద వైరు తగలడంతో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మంగళవారం ఉదయాన్నే బావి దగ్గరికి వెళ్లిన రైతు విగతాజీవిగా పడి ఉన్న ఆవును చూసి బోరున విలపించారు.

Spread the love