కోనాపూర్ లో డైరీ ఫామ్ దగ్ధం

– సుమారు రూ.7లక్షల వరకు నష్టం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో  గ్రామానికి చెందిన మంగి హరీష్ డైరీ ఫామ్ పూర్తిగా దగ్ధం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు చల్లార్పాడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు రూ.7లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు మంగి హరీష్ తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో పశువుల దాణా, దాణాను తయారుచేసే సామగ్రి, 1500 గడ్డి కట్టలు, షెడ్డు మొదలుకొని సుమారు రూ.7లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు  బాధితుడు వాపోయాడు.డైరీ ఫామ్ సమీపంలో  ఉన్న పొలానికి నిప్పు పెట్టడం మూలంగా మంటలు డైరీ ఫామ్ వరకు వ్యాపించి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ప్రమాద సంఘటనకు చేరుకొని  మంటలను ఆర్పడం మూలంగా  షెడ్లలో ఉన్న పశువులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని బాధితుడు తెలిపాడు. పొలాలకు నిప్పు పెట్టే రైతులు కాస్త జాగ్రత్త తీసుకొని ఇతరులకు నష్టం జరక్కుండా చూడాలని పలువురు వ్యాఖ్యానించారు.
Spread the love