– డిసిసిబి డైరెక్టర్ మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రమాణస్వీకారం లో మండల కేంద్రానికి చెందిన డిసిసిబి డైరెక్టర్ మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో కలసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకట్ రెడ్డికి సాల్వతో సన్మానం చేసి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగం చూసి మంత్రి పదవి తృణపాయంగా వదిలేసి రాష్ట్ర ఏర్పాటు కావాలని పోరాటం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రతో కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన నల్లగొండ ప్రజలు వెంకట్ రెడ్డి పక్షాన నిలబడి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ కు గుణపాఠం చెప్పే విధంగా 56 వేల మెజార్టీ తో వెంకట్ రెడ్డిని గెలిపించుకున్నారని అన్నారు . గత పది సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాపై పక్షపాతం చూపించిన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని ఆరోపించారు . కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాష్ట్ర మంత్రి నేతృత్వంలో నల్లగొండ జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి కానుందని ధీమా వ్యక్తం చేశారు.