సంతలోని అక్రమ కట్టడం కూల్చివేత..

నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని సంత ప్రాంగణంలో దశాబ్ద కాలాలుగా ఉన్న అక్రమ కట్టడాన్ని సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ కార్యదర్శి రవీంద్ర నాయక్ బుధవారం కూల్చివేశారు. సంత ప్రాంగణంలో నడిబొడ్డున ఉన్న అక్రమ కట్టడం వలన క్రయవిక్రయదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కట్టడం విషయమై పలు ఫిర్యాదులు రావడంతో గత పాలకవర్గాలు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో సర్పంచ్ ఏ టి ఎస్ శ్రీనివాస్ కబ్జాదారుడితో మరోచోట కట్టడం నిర్మించుకునేందుకు పాలకవర్గంతో ఒప్పందం కుదుర్చుకొని నడిబొడ్డున గల కట్టడాన్ని పూర్తిగా తొలగించారు. గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో సంత ప్రాంగణం అక్రమ కట్టడాలతో 20% కు పైగా కబ్జాకు గురికావడంతో తెలంగాణలోనే ప్రఖ్యాతిగాంచిన సంత సమస్యగా మారింది. నడిబొడ్డున గల కట్టడాన్ని కూల్చివేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love