IPL : టాస్ గెలిచిన దోని..గుజరాబ్ బ్యాటింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : మరికొద్ది సేపట్లో ఐపీఎల్ సీజన్ 16 లో ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ లో చేనై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ లు తలపడనున్నారు. నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడడంతో ఈ రోజు మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో హోమ్ టీం అయిన గుజరాత్ కె ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. ఇందుకు కారణంగా బ్యాటింగ్ లో శుబ్ మాన్ గిల్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ , షమీ , నూర్ అహ్మద్ లు రాణించడమే అని చెప్పాలి. ఇక చెన్నై బ్యాటింగ్ లో ఎదుర్కొంటున్న సమస్య స్పిన్ ను సమర్ధవంతమగా ఆడలేకపోవడమే. అలాంటప్పుడు గుజరాత్ తో స్పిన్ లో రాటుదేలిన రశీద్ ఖాన్ నూర్ అహ్మద్ లను ఎదుర్కొని పరుగులు చేయడం ఏమంత సులభం కాదు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ వేయగా చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. టాస్ గెలచి ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Spread the love