బిడ్డ శవాన్ని 10 కి.మీ మోసుకెళ్లిన తల్లి..

నవతెలంగాణ-హైదరాబాద్ : మానవత్వం అనే మాట రాను రాను కనుమరుగయ్యే పరిస్థితులు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.. డబ్బులకు విలువిస్తున్నారు కానీ మనిషి ప్రాణాలకు మాత్రం విలువ లేకుండా పోతుంది.. చేతిలో డబ్బులు లేక కూతురు శవాన్ని చేతుల మీద 10 కిలో మీటర్లు మోసుకెళ్లిన ఘటన ఒకటి వెలుగు చూసింది.. అందుకు సంబందించిన ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ వార్త వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.. తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఆదివారం పాముకాటుకు గురైంది.. దాంతో హుటాహుటిన ఆస్పత్రికి మోసుకొని తీసుకెళ్లారు..సరైన రవాణా సౌకర్యం లేక చేతుల మీద మోసుకెళ్లారు.. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకొని వెనుతిరిగారు..విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు అంబులెన్స్ ను పంపించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు మళ్లీ అంబులెన్స్ ఎక్కారు. అయితే కొండ ప్రాంతం తమ గ్రామానికి రాకపోకలు సాగించలేకపోవడంతో అంబులెన్స్ వారిని గమ్యస్థానానికి 10 కిలోమీటర్ల దూరంలో దింపేశారు..ఇక చేసేదేమి లేక ఏడుస్తూ మృతదేహన్ని మోసుకొని వెళ్ళారు.. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Spread the love