రూ.269 కోట్ల నగదు, మద్యం పట్టివేత

– రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోకసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా డిసెంబర్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు రూ. 2.69,70,61,990 విలువ చేసే నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ. 92,60,64,307 నగదు, రూ. 57,45,45,553 మద్యం, రూ. 28,42,28,137 డ్రగ్స్‌, నార్కొటిక్స్‌, రూ. 60,76,25,640 బంగారం, వెండి ఇతర ఆభరణాలు, రూ .30,07,11,136 ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఇతర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం ఇతర వస్తువులు తీసుకెళ్లేటప్పుడు తగిన రశీదులు అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

Spread the love