– సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ కె వెంకా రెడ్డి
నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 75% శాతం ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగినదని, యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ కె వెంక రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలలో కాస్త తక్కువ శాతం అయిందని, మున్సిపాలిటీలలో ఉన్న బిఎల్వోలు మరికొంత సమయం వెచ్చించి డోర్ టు డోర్ తిరిగి ఓటర్ల నుండి ఫార్మ్స్ తీసుకొని వెంట వెంటనే డిజిలైజేషన్ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఓటర్లు అందరు కూడా తమ ఓటు వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్ లో నమోదు చేసి తమ తమ బి ఎల్ ఓ లకు వెంటనే అందజేయాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు తహసిల్దార్ వి ఆంజనేయులు, గిర్దవర్ పూర్ణ చందర్ రావు, జీపీఓ లు శ్రీనివాస్, స్వామి, బి ఎల్ వో లు ఫాతిమా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
75% పూర్తైనా ఏన్యుమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


