సతీష్ కుమార్ ఓటేయాలని దివ్యాంగుల ప్రచారం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఓటేయాలని శనివారం హుస్నాబాద్ మండలంలోని జిల్లేలగడ్డ , పోతారం ఎస్ గ్రామాల్లో సతీష్ కుమార్  మద్దతుగా దివ్యంగులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ వికలాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేశాడని తెలిపారు. కేసీఆర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని దివ్యాంగులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Spread the love