బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు కేరాఫ్

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కేరాఫ్ గా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని సర్పంచ్ లావుడియా స్వరూప అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలంలోని జిల్లాల గడ్డ గ్రామంలో సర్పంచ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని పింఛన్ దారులను బీఆర్ఎస్ మేనిఫెస్టోను అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పేదలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో కోరారు.
Spread the love