విద్యార్థులకు పెన్నులు,పెన్సిళ్లు,నోట్ బుక్కులు పంపిణీ

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం వెన్నపురెడ్డి రాంరెడ్డి, రమాదేవి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్కులు ,పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, పండ్లు పంపిణీ చేసినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ నాయక్ తెలిపారు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వారికి పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు, సిబ్బంది తరపున వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఎవరైన తమ పుట్టిన రోజు కాని పెళ్లిరోజు సందర్భంగా తమ పాఠశాల విద్యార్థులకు తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love