రైతులకు రాజన్న కోడెలు పంపిణీ..

నవతెలంగాణ -వేములవాడ
రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెక్కులు చెల్లించుకోవడం ఆనవైతిగా వస్తుంది.. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారి గోషాల నుండి పదిమంది పేద రైతులకు ఉచితంగా రాజన్న కోడలు బైరి సతీష్ కోడెలను అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ రాజన్న నిజకోడలను వాటి పోషనార్థమై గోశాలకు ఇవ్వడం జరుగుతుంది, రైతులకు ఇచ్చి వారి వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వాటిని పోషణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రైతులు శ్రీధర్, దుర్గయ్య, శివ బాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love