కారు దిగుతున్న కార్యకర్తలు.. వాడిపోతున్న కమలం

– కాంగ్రెస్ లోకి వలసలు..
– కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఫీర్ మొహమ్మద్..
– బీజేపీ పార్టీ వీడిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీశైలం..
– కండువా  కప్పి సాదరంగా ఆహ్వానించిన అది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహ్మద్, మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కోయీనేని శ్రీనివాస్, రాజరాజేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త తాటికొండ వాణి పవన్, చిలుక దేవరాజు రాజు, అరికేల సతీష్, నక్క రాజు, ఎండి రజాక్, కుసం మధు ఆర్యవైశ్య నాయకులు నూకల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్, బిక్కుమల్ల రాజు, కోటగిరి రాజేందర్, గంప గోపాల్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్ సమక్షంలో చేరారు.. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించరు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీలలో పని చేసి,ప్రస్తుత వివిధ హోదాల్లో ఉన్న మేము నేడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు..నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో బీసీ బిడ్డ పేదల నాయకుడు అది శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అన్నారు..
Spread the love