నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గాను పలు అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 12 మందితో 4వ జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 19 స్థానాలు పెండింగ్లో పెట్టింది. జనసేనతో పొత్తు ఉంటుందని చెప్పినా ఆ పార్టీకి కేటాయించిన స్థానాలపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా నాలుగో లిస్టులో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. వేములవాడ సెగ్మెంట్ను తుల ఉమకు కేటాయించారు.
అభ్యర్థుల జాబితా ఇలా..
చెన్నూర్ – దుర్గం అశోక్
ఎల్లారెడ్డి – సుభాష్ రెడ్డి
వేముల వాడ – తుల ఉమ
హుస్నాబాద్ – శ్రీరామ్ చక్రవర్తి
సిద్ధిపేట – శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ – నవీన్
కొడంగల్ – బంటు రమేష్ కుమార్
గద్వాల – బోయ శివ
మిర్యాల గూడ – సాధినేని శ్రీనివాస్
మునుగోడు – చలమల క్రిష్ణారెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) – నకరకంటి మొగులయ్య
ములుగు (ఎస్టీ) – అజ్మీరా ప్రహ్లాద్ నాయక్