బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని మైలారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన గద్దల మల్లయ్య, జనగం లచ్చయ్య కుటుంబాలను శనివారం ఎస్ఆర్ఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి బాధిత కుటుంబాలకు రెండు క్వింటాల బియ్యం అందచేశారు. గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లేతకుల మహేందర్ రెడ్డి, సంధి అమ్మిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉల్లెంగుల యాదగిరి, బీరం వెంకటరెడ్డి, లేతకుల రంగారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బెట బాబు, చిర్ర మల్లయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెడుపాక యాకయ్య, తీన్మార్ మల్లన్న టిమ్ మెంబర్ గాడిపెళ్లి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love