కోలాటం బృందాలకు చీరల పంపిణీ… 

నవతెలంగాణ -చివ్వేంల
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల  జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన(జిజెఆర్)కప్ -2023 గ్రామీణ క్రీడల్లో భాగంగా గెలుపొందిన కోలాటం బృందాలకు  ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి గురువారం మండలంలోని మొగ్గయ్య గూడెం, బీమ్లా తండా, చందుపట్ల గ్రామంలో కోలాటంలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణి చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషివలనే బీడు బారిన భూములు సస్యశ్యామలంగా ఉన్నాయని,  జగదీష్ రెడ్డిని సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు  మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమాలలో  జడ్పీటీసీ భూక్య సంజీవ్ నాయక్, పి ఏ సి ఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు, బీఆర్ఎస్ యువజన విభాగం మండల ఉపాధ్యక్షుడు  భూక్య నాగు నాయక్,  సర్పంచులు భూక్య రాజ్యలక్ష్మి,ధరావత్ హాముడా,బోయిల కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు శిగ ఉప్పలయ్య, భూక్య వెంకన్న, అమృ,  ఉప సర్పంచ్ లు శివరాత్రి కృష్ణ, బిక్కు, వార్డు మెంబర్లు,బి ఆర్ ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు…
Spread the love