- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మల్లారం గ్రామ పరిధిలోగల కస్తూరిబ్బా గాంధీ ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఏకారుప దుస్తులను బుధవారం ఎంపిడిఓ క్రాంతి కుమార్, గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య, ఎంఈఓ లక్ష్మన్ బాబు, ఐకెపి ఏపీఎం హనుమంతరావు, శ్రీలక్ష్మి సమాఖ్య అధ్యక్షురాలు శారద అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం 225 మంది బాలికలు ఉంటే అందరికి మొదటి జత అందజేయడం జరిగిందని పాఠశాల ప్రత్యేక అధికారి భవాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతి, పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్, సిఆర్పీ సమ్మయ్య, ఆలివ్ సంస్థ టి.రజిత, స్టిచింగ్ సెంటర్ నిర్వాహకులు నవల, ప్రగతి, ఎస్హెచ్జి స్వప్న, నక్షత్ర పాల్గొన్నారు.
- Advertisement -



