అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది..

– బాధిత కుటుంబానికి చేయూత
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చంద్రగిరి ఎంక్కమ్మ కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ మండల  మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత రాజిరెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరమార్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, రూ.5 వేలు ఆర్థిక సాయం చేసి చేయితనిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి, గ్రామ ఇంచార్జి అధ్యక్షుడు చంద్రగిరి సంపత్,కాంగ్రెస్ నాయకులు  వేముల చంద్రమోహన్, అల్లాడి సురేష్,దుద్దిళ్ల సత్యం,చంద్రగిరి అశోక్ పాల్గొన్నారు.
Spread the love