నవతెలంగాణ – ముంబయి: కళాశాల ఆవరణలో ఇటీవల విద్యార్థులు హిజాబ్ ధారణను నిషేధించి వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్పైనా నిషేధం విధించింది. తమ కాలేజీకి వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబయిలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్జీ ఆచార్య, డీకే మరాఠే కాలేజీల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని, ఫార్మల్, డీసెంట్ దుస్తులతో పాటు హాఫ్ లేదా ఫుల్ షర్ట్, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. బాలికలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్ 27న నోటీసు జారీ చేసింది.