కాంగ్రెస్ వాళ్లని నమ్మొద్దు.. వస్తుంటారు పోతుంటారు..

నవతెలంగాణ- కోస్గి: కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నమ్మవద్దని ఎన్నికలప్పుడు వస్తుంటారు.. పోతుంటారు. 6 గ్యారంటీలు అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపల్ పరిధిలోని తిమ్మయిపల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి  మంగళవారం ప్రచారం చేపట్టారు. కెసిఆర్  ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నది. ప్రజలు కాంగ్రెస్ చెప్పే మాయ మాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటు చేయాలని కోరారు.

Spread the love