సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం ప్రారంభం

– రూ.10,000 రూపాయల విరాళం అందజేసిన వరికుప్పల యాదయ్య 

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థికి మంగళ హారతులతో, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఓటు అభ్యర్థించే క్రమంలో ఓ కార్యకర్త ఇంటికి వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థికి సీపీఐ(ఎం)సీనియర్ నాయకుడుగా ఉన్న వరికుప్పల యాదయ్య-యాదమ్మ దంపతులు ప్రచార ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక  సాయాన్ని విరాళంగా అందజేశారు. ప్రజల కోసం పోరాడే  నాయకుడు గెలవడం ప్రజలకు ఎంతో అవసరమని ఈసారి మా ఓటు మీకే అంటూ అనేకమంది వారికి హామీని ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ పులిగిల్ల గ్రామంతో గత 35 సంవత్సరాలుగా అనుబంధం ఉందని మొట్టమొదటి ప్రచారం సాయుధ పోరాట చరిత్ర కలిగిన పులిగిల్ల నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు వస్తున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల యొక్క చరిత్ర ఏమిటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి, ప్రజల కోసం ఎలాంటి వ్యాపారాలు, వ్యాపకాలు లేకుండా పోరాడుతున్న నాలాంటి వ్యక్తికి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు.
ఈ గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారని, కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజల కోసం పనిచేసే సేవకున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగతా మూడు పార్టీల అభ్యర్థులు ఏనాడు ప్రజల కోసం పోరాడిన చరిత్ర లేదని వాళ్లకున్న వ్యాపారాలను మరింత పెంచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగదని అందుకే నిజాయితీగా  ప్రజా పోరాటాలు చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించే బునాది గాని కాలువ ప్రారంభించి 20 సంవత్సరాలు గడుస్తున్న పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా నేటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. సీపీఐ(ఎం) ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే బునాది గాని కాలువను పూర్తి చేయడమే కాకుండా ఆ కాలువ ద్వారా గోదావరి జలాలను ఈ ప్రాంత రైతాంగానికి అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, నారి ఐలయ్య, జగదీష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి  ఆవనగంటి వెంకటేశం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్,సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకట్ రెడ్డి,కందడి సత్తిరెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,స్థానిక పార్టీ నాయకులు దొడ్డి బిక్షపతి,వరికుప్పల యాదయ్య, వడ్డేమాన్ వెంకటయ్య, బుగ్గ ఐలయ్య, వేముల చంద్రయ్య,వరికుప్పల శంకరయ్య,వేముల ఆనంద్, దొడ్డి యాదగిరి, వేముల అమరేందర్, బొడ్డు రాములు,వేముల ముత్తయ్య,వడ్డెమని మధు,వనం యాదయ్య,మారబోయిన ముత్యాలు,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు,వరికుప్పల సతీష్,కొమ్మిడి క్రిష్ణా రెడ్డి, వరికుప్పల శ్రీశైలం,వేముల రాంబాబు,సందేల శ్రీకాంత్, వేముల జ్యోతిబస్,దయ్యాల నర్సింహ,వరికుప్పల యాదమ్మ,వేముల రమణమ్మ,మౌనిక,వడ్డెమని ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love