రోహిత్ – శశి రచన, దర్శకత్వంలో రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘డబుల్ ఇంజన్’. ‘పరేషాన్’ లాంటి న్యూ ఏజ్ చిత్రాన్ని అందించిన వాల్టెయిర్ ప్రొడక్షన్స్లో సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. లేటెస్ట్గా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. డానీ, మౌళి, నర్సింగ్, గోపి.. ఈ నలుగురు స్నేహితులు డబ్బు సంపాదించడానికి ‘డబుల్ ఇంజన్’ కోసం చేసిన ప్రయత్నాలను చాలా థ్రిల్లింగ్ అడ్వంచరస్ జర్నీగా ప్రజంట్ చేసిందీ ట్రైలర్. ముని, రోహిత్, రాజు, అజిత్, గాయత్రి గుప్తా, సాయి కిరణ్ యాదవ్, పవన్ కష్ణ తమ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కథ, కథనానికి తగట్టుగా ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్గా ట్రైలర్ బ్రిలియంట్గా ఉంది. ట్రైలర్ని గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారు. విజువల్స్లో రా నెస్ అద్భుతంగా చూపించారు. వివేక్ సాగర్ తన బీజీఎంతో కంటెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. అమెజింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెరేటీవ్ని మరింత లైవ్లీగా చూపించింది. శశాంక్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్లో ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది అని చిత్ర యూనిట్ తెలిపింది. జనవరి 5న ఈ సినిమా విడుదల కానుంది.