మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్స్ కంట్రోల్ దాడులు

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ కంట్రోల్ దాడులు జరిపాయి. రూ.51.92 లక్షల విలువ చేసే ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40 శాతం డిస్కౌంట్ పేరుతో ఇన్సులిన్ ఇంజెక్షన్ల విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్స్ లేకుండా అక్రమంగా ఇన్సులిన్ ఇంజక్షన్లను దిగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. రూ.5,263 బదులు రూ.2,070 కి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love