నేడు డీఎస్ అంత్యక్రియలు..

నవతెలంగాణ – హైదరాబాద్: గుండెపోటుతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్‌లో జరగనున్నాయి. మ.12 గంటలకు ప్రగతినగర్‌లోని నివాసం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. డీఎస్ పార్థివదేహానికి నివాళి అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

Spread the love