– ఖర్గే హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల తనిఖీలు
– తప్పుపట్టిన కాంగ్రెస్
ఇటావా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రయాణించాల్సిన హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలిక్యాప్టర్ను కూడా ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీలు చేశారని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏ నేతలను వదిలేస్తూ విపక్ష పార్టీ నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించింది. ఎన్డీఏ కూటమిలోని ఆగ్రనేతలు ప్రయాణిస్తున్న హెలికాప్ట్టర్లను కూడా ఇలాగే తనిఖీ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.