ఉద్యోగుల సంఘం యాదాద్రి జోన్ అధ్యక్షులుగా కే సుదర్శన్ ఎన్నిక

నవతెలంగాణ –  భువనగిరి రూరల్
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం యాదాద్రి జోన్  జిల్లా అధ్యక్షులుగా కే  సుదర్శన్ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాదులో  తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ జనరల్ బాడీ సమావేశం  నిర్వహించగా, ఆయన ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్వర్యములోని 33 జిల్లాలు,ఎస్ టిఏలతో కూడిన రవాణా శాఖలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లతో అసోసియేషన్ ను ఏర్పాటు చేయాలని జనరల్ బాడీ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈయన 2024 నుంచి 2027 వరకు అధ్యక్షులుగా కొనసాగుతారు.
Spread the love