యాదవ సంఘం నూతన కమిటీలు ఎన్నిక

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామ అఖిల భారత యాదవ మహాసభ నూతన కమిటీలను శుక్రవారం నియామకం చేసినట్లుగా కాటారం డివిజన్ కార్యదర్శి బోయిని రాజయ్య యాదవ్ తెలిపారు. గ్రామ అధ్యక్షుడుగా బియ్యని రాజమొగిలి యాదవ్, గౌరవ అధ్యక్షుడు బియ్యని ఉషన్న యాదవ్,ఉపాధ్యక్షుడుగా జక్కుల లక్ష్మన్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా బొంతల హరీష్ యాదవ్,కార్యదర్శిగా బియ్యని కుమార్ యాదవ్,కోశాధికారిగా పర్సవెన రమేష్ యాదవ్ ఎన్నికయ్యారు.రానున్న సర్వత్రా ఎన్నికల్లో యాదవులు ఐక్యాత చాటి,యాదవుల నుంచి ప్రజాప్రతినిధులుగా గెలుపొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మండల గౌరవ అధ్యక్షుడుగా యాధండ్ల రామన్న యాదవ్, డివిజన్ సహాయ కార్యదర్శి కోడారి చిన మల్లయ్య యాదవ్, అప్పల భూమేస్ యాదవ్,మొగిలి రాజ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
Spread the love