ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి: సీఐ శ్రీను

– గుండారం గ్రామస్తులకు సీఐ శ్రీను సూచన 
– సమస్యలను సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక 
నవతెలంగాణ – బెజ్జంకి 
ఎన్నికల సమయంలో గుండారం గ్రామం సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా నమోదైందని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి గ్రామస్తులు సహకరించాలని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను సూచించారు. సోమవారం మండల పరిధిలోని గుండారం గ్రామస్తులతో సీఐ శ్రీను ఎస్ఐ క్రిష్ణారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఎన్నికల రోజున ఎవరైనా సమస్యలు సృష్టించి ఎన్నికలకు అటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని..ప్రతి ఒక్కరూ సహరించాలని హెచ్చరించారు.
Spread the love