బడీడు పిల్లలను బడిలో చేర్పించండి..

– తాడిచెర్ల హైస్కూల్ ప్రాధానోపాధ్యాయుడు…మల్కా భాస్కర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
బడిడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తాడిచెర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో బడిబాట నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మధ్యాహ్న భోజనం,పుస్తకాలు,నోట్ బుక్స్, యూనిపామ్స్ వంటి సౌకర్యాలు గురించి తల్లిదండ్రులు వివరించారు.విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.10వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జీపీఏ సాధించడం జరుగుతుందన్నారు.అనంతరం పాంప్లెయిన్స్ ఆవిష్కరించి,ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love