ఓటు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు ను వినియోగించుకోవాలి..

నవతెలంగాణ – తొగుట
దేశంలో అతి పెద్ద భారత రాజ్యాంగంలో ఓటు హక్కు కలిగి ఉన్న దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని దుబ్బాక నియో జక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తన సొంత గ్రామమైన తుక్కాపూర్ 126 పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించు కున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపం చ దేశాలల్లో అతిపెద్ద రాజ్యాగం కలిగిన దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాల న్నారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పిం చిన ఓటు హక్కు గుర్తు చేశారు. నీతి నిజయితీగల నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక కో-ఆర్థినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్ ), తోగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షడు ఊళ్లేంగల సాయి కుమార్ ముదిరాజ్, ఏస్సి సెల్ మండల అధ్యక్షడు లింగాల కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పలయ్య, చిక్కుడు భాస్కర్, స్వామి, చిక్కుడు స్వామి, బి. నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love