నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి…

నవతెలంగాణ మల్హర్ రావు: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా, నిర్భయంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల ఎన్నికల అధికారి కోరారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మండలంలోని తాడిచెర్ల, మల్లారం, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు.ఓటు వినియోగంపై మానవహారం,ర్యాలీలు నిర్వహించారు.ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారు కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వారిని ఓటును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, బిఎల్ఓలు, అంగన్ వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఐకేపి సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love