5వ తరగతి దరఖాస్తుల గడువు పొడిగింపు

నవతెలంగాణ – భిక్కనూర్
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి  దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని మండలంలోని  సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Spread the love