నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలో ఐసెట్ దరఖాస్తులకు గడువు పొడిగించారు. మార్చి 5న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులకు గడువు ముగియగా.. మే 7 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలస్య రుసుం లేకుండా మంగళవారం వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు రూ.250 ఆలస్య రుసుంతో మే 17 వరకు; రూ.500 ఆలస్య రుసుంతో మే 27 వరకు అప్లై చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మే 28న హాల్టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. జూన్ 28న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.