విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడంలో విఫలం

– ఆప్‌ రాష్ట్ర కన్వీనర్‌ : దిడ్డి సుధాకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆప్‌ రాష్ట్ర కన్వీనర్‌ దిడ్డి సుధాకర్‌ విమర్శించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి జాదవ్‌ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలనీ, విద్యార్థులు ఆత్మహత్యల ను నివారించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నిర్మల్‌ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగిన ఆప్‌ విద్యార్ధి విభాగం నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలనీ డిమాండ్‌ చేశారు. విద్యా సంస్థలు మత్యు కేంద్రాలుగా మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. విద్యార్ధి జాదవ్‌ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love