అప్పుల బాధతో రైతు ఆత్మహత్య…

నవతెలంగాణ-సిరిసిల్ల : అప్పుల బాధ భరించలేక మనోవేదన గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్న లింగపూర్ లో చోటుచేసుకుంది.. వివరాల లోకి వెలితే గ్రామానికి చెందిన శ్యాగ చంద్రయ్య (55) అనే రైతు తనకున్న ఎకరం నర, పొలం లో వ్యవసాయం చెసుకుంటు జీవనం సాగిస్తున్నాడు.. చంద్రయ్య కు,భార్య లక్ష్మి, ఇద్దరు కూతుర్లు, అకాంక్ష,అంజలి, కుమారుడు హరిష్ లు ఉన్నారు. ఇద్దరు కుతుర్లకు,వివాహాలు చేయగా,సుమారు 12 లక్షల అప్పులపాలైనట్లు స్థానికులు తెలిపారు.. తంగళ్ళపల్లి పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love