- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది. పదిమంది రైతులకు చెందిన సుమారు 150 ధాన్యం బస్తాలు వర్షపు నీటిలో తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను కష్టపడి పండించిన తమకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
- Advertisement -



