- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఝార్ఖండ్లోని లాతెహార్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘దేద్ తంగవా’ లోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు అదుపుతప్పి, ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



