– సుమిత్ రాయ్, ఎడెల్వైజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ
నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచం ఆర్థికంగా మందగమనంలో ఉన్నప్పుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది స్పష్టంగా చెప్పుకోదగిన బలాన్ని ప్రదర్శించింది. ఈ బలం ఎక్కువగా దృఢమైన వినియోగం, బలమైన పెట్టుబడి కార్యకలాపాలు, అభివృద్ధి చెందుతున్న, ఆకాంక్షించే వినియోగదారుల శ్రేణితో మార్గదర్శంతోనే సాధ్యమైంది. ప్రగతిశీల విధాన సంస్కరణలను తీసుకురావడంపై ఇటీవలి ఏడాదులలో దేశం దృష్టి, డిజిటల్ మార్పు కూడా ఈ వృద్ధి పథానికి మద్దతునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తన సహచరులను, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని వారి కన్నా మెరుగైన పనితీరును భారతదేశం కనబరచింది.
ఈ విస్తృత ఆర్థిక స్థితిస్థాపకత కారణంగా, బీమా పరిశ్రమ కూడా వృద్ధిని కొనసాగించింది. ఈ 2023 ఏడాదిలో పరిశ్రమ కోసం మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని పరిణామాలను చూసింది. ఇందులో బీమా పాలసీల నుంచి వచ్చే ఆదాయంపై, ఏప్రిల్ 2023 నుంచి ప్రతి ఏడాది చెల్లించే రూ.5 లక్షల విలువైన ప్రీమియంపై పన్ను విధించాలనే ప్రభుత్వ నిర్ణయం కూడా ఉంది.
వినియోగదారుడు, డిస్ట్రిబ్యూటర్ మేనేజ్మెంట్ ప్రక్రియలను పునర్నిర్మించడానికి డిజిటలైజేషన్కు నిరంతర ప్రాధాన్యత ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) 3 ప్రముఖ ఇతివృత్తాలపై దృష్టి సారించి పలు సంస్కరణలను తీసుకువచ్చింది – పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, అందుబాటు, చేరువను మెరుగుపరచడం, పాలసీదారుల ఆసక్తిని కాపాడడం ఇందులో ఉన్నాయి. మనం ఇప్పుడు 2024 ఏడాదిలోకి అడుగు పెట్టేందుకు వేచి చూస్తున్న నేపథ్యంలో, పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్లేందుకు నియంత్రణ సంస్కరణలు కొనసాగుతాయని నేను ఆశిస్తున్నాను. కొత్త ఏడాదిలో 3 కీలక పోకడలు బయటపడే అవకాశం ఉంది:
ఎ.బీమా ట్రినిటీ:
ఐఆర్డిఐఏ 2047 నాటికి అందరికీ బీమా అనే దాని దృష్టికోణంలో భాగంగా బీమా ట్రినిటీ చొరవను ఆవిష్కరించింది. ఈ ప్రయత్నం ప్రాథమిక లక్ష్యం బీమా స్థోమత, అందుబాటును తీసుకురావడం. బీమా సుగమ్, బీమా విస్టార్, బీమా వాహక్లను కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేర్వేరు వ్యవధులలో ప్రారంభం అవుతుందని అంచనా.
బీమా సుగమ్ అనేది ఆన్లైన్ మార్కెట్ప్లేస్, కొనుగోలు చేయడం నుంచి సర్వీసింగ్ వరకు మొత్తం వినియోగదారుని ప్రయాణాన్ని కలిగి ఉంటుంది. ఇది బీమా అందుబాటును మరింత సులభతరం చేస్తుందని అంచనా. బీమా విస్తార్ ప్రజలకు సరసమైన రక్షణను అందించడానికి ప్రయత్నిస్తున్న ఒక విప్లవాత్మక బీమా ఉత్పత్తి అని వాగ్దానం చేసింది. ఇది జనవరి 2024 నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. బీమా వాహక్ అనేది గ్రామసభ స్థాయిలో మహిళా–కేంద్రీకృత పంపిణీ ఛానెల్. ఇది మహిళలకు సమగ్ర బీమా ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
బీమా ట్రినిటీ అనేది ఆర్థిక సమ్మేళనాన్ని ప్రోత్సహిస్తుంది. సాటిలేని సౌలభ్యాన్ని సృష్టించుందకు డిజిటల్ను ప్రభావితం చేస్తూ, అందుబాటు, సరళీకరణ, సరసమైన కవరేజ్, బీమా పరిశ్రమలో మహిళల అధిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
బి. ఉత్పత్తి ఆవిష్కరణ:
రెగ్యులేటర్ నేటి వినియోగదారుడు ఆశించే అంచనాలకు అనుగుణంగా సరళీకృత, వ్యక్తిగతీకరించిన ఉత్పత్తుల అవసరాలపై అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇది ఈ లక్ష్యాన్ని సాధించేందుకు యూజ్ అండ్ ఫైల్ నిబంధనలను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఈ మార్గదర్శకాల పరిధిని విస్తరిస్తోంది. మెరుగైన, సరళీకృత పరిష్కారాలను రూపొందించేందుకు ఏఐ,మిషన్ లెర్నింగ్ వంటి నూతన–తరపు పరిష్కారాలతో సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావితం చేసుందకు రెగ్యులేటర్ ముందుగానే పరిశ్రమను పురికొల్పాలని మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర–స్థాయి బీమా ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా రెగ్యులేటర్ మొత్తం ప్రయత్నాలు భౌగోళిక ప్రాంతాలలో వినియోగదారుల సూక్ష్మ అవసరాలపై అధిక స్పష్టతను అందిస్తాయి. కనుక, మనం మీడియం–టర్మ్లో మార్కెట్లోకి మరిన్ని సముచిత ప్రొడక్ట్స్ను చూసేందుకు అవకాశం ఉంటుంది.
సి. కొత్త ప్లేయర్లుకు లైసెన్స్
రెగ్యులేటర్ ఈ ఏడాది ఇప్పటికే 3 కొత్త కంపెనీలకు లైసెన్స్ని అందించగా, మరి కొన్ని కంపెనీల ప్రవేశానికి ఇది అనుమతిస్తుందని భావిస్తున్నారు. ఐఆర్డిఐఏ తక్షణ భవిష్యత్తులో 20 కొత్త బీమా సంస్థలకు లైసెన్స్లను జారీ చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. అదనంగా, రెగ్యులేటర్ మూలధన అవసరాలను పునఃపరిశీలించే అవకాశం అనేది కొత్త సంస్థల ప్రవేశాన్ని సులభం చేస్తుంది. మార్కెట్లో పెరిగిన పోటీతత్వంతో, ఈ రంగం మరింత ఆవిష్కరణలు, మెరుగైన పంపిణీ నమూనాలు, ఆటోమేషన్ తదితరాలను చూసేందుకు అవకాశం ఉంది. అందరూ 2024లో ఎదురుచూస్తున్న పరిణామాలలో ఒకటైన ప్రభుత్వం బీమా చట్టాల (సవరణ) బిల్లు 2022 కాగా, ఇది పరిశ్రమలో మరో రౌండ్ సానుకూల సంస్కరణలను తీసుకువచ్చేందుకు, వృద్ధి అవకాశాలను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.