సాయంత్రం 5 గంట‌ల‌కు రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తొలి క్యాబినెట్ భేటీ

నవతెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సాయంత్రం 4:45 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తొలి కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి, కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. సీఎం రేవంత్ కేబినెట్‌లో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, కొండా సురేఖ‌, ధ‌న‌స‌రి అనసూయ‌(సీత‌క్క‌), తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు జూప‌ల్లి కృష్ణారావు ఉన్నారు.

Spread the love