అమల్లోకి కొత్త నేర చట్టాలు.. తొలి కేసు ఎక్కడ నమోదైందంటే?

నవతెలంగాణ – హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదైంది. మరి ఎక్కడ ఈ కేసు నమోదైందంటే? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్‌డీఆర్‌ఎస్‌ సమీపంలోని ఫుట్‌ ఓవర్ బ్రిడ్జ్‌ కింద రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని గుర్తించిన పెట్రోలింగ్‌ పోలీసులు దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఆ వ్యాపారిని తన బండిని వేరే చోటుకు తరలించమని గతంలో పలుమార్లు చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో అతడి వ్యాపారం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ వీధి వ్యాపారిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Spread the love