కాలువలో పడిన కారు.. ఐదుగురు మృతి

బెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవ పుర సమీపంలోని విశ్వేశ్వరయ్య కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది కాలువ నుంచి మృతదేహా లను వెలికితీశారు. మృతులందరూ తుముకూరు జిల్లాలోని తిప్తూర్‌కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. మైసూర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయింది.
బాధితుల స్వస్థలం తుముకూరు జిల్లాలోని తిపతూర్‌ కాగా, వారంతా ప్రస్తుతం భద్రావతిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను చంద్రప్ప, కృష్ణప్ప, ధనుంజరు, బాబు, జయన్నగా గుర్తించారు. ఘటనకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతులంతా బంధువులని వెల్లడైందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Spread the love