అనేక పనుల మధ్య మహిళలు తమ గురించి తాము పట్టించుకోరు. అది శారీరక ఆరోగ్యమైనా, మానసిక ఆరోగ్యమైనా సరే నిర్లక్ష్యం చేస్తారు. మరీ ముఖ్యంగా మహిళలకు ఓ మనసుంటుందనీ, దానికీ కాస్త ఆనందం, ప్రశాంతత కావాలనే విషయాన్నే ఈ సమాజం మర్చిపోతుంది. అందుకే మహిళలు తమ గురించి తాము పట్టించుకునేలా శిక్షణ ఇవ్వాలని శర్మిష్టా మజుందర్ భావించారు. అందుకోసమే ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ ప్రారంభించారు. దీని గురించి మరిన్ని వివరాలు…
శర్మిష్ఠ మజుందర్ దశాబ్దానికి పైగా యాక్సెంచర్, డెల్ఫీ ఆటోమోటివ్ వంటి సంస్థలలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఈ సమయంలో ఆమె మనస్తత్వశాస్త్రం, మానసిక ఆరోగ్యం పట్ల తీవ్రంగా ఆకర్షితులయ్యారు. ఈ రంగంలో క్రమంగా నైపుణ్యాన్ని పెంచుకున్నారు. 2018లో ఆమెకు బాబు పుట్టినపుడు కూడా ఆమె ఉద్యోగం కొనసాగించారు. కానీ మనసులో ఎక్కడో ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ అనే పేరు పదేపదే మెదులుతూనే ఉంది. ‘దాని వెనుక ఏదో ఒక ఉద్దేశ్యం ఉందని నాకు అనిపించింది. దాని గురించి ఏదైనా చేయాలనుకున్నాను’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ముఖ్యమైన లోపాలు
తన కొడుకుకి రెండేండ్లు నిండిన తర్వాత ఆమె మానసిక ఆరోగ్య రంగంలో ఏదైనా అర్థవంతమైన పని చేద్దామని తన ఉద్యోగాన్ని వదిలేశారు. కానీ ఏం చేయాలో కచ్చితంగా తెలియదు. అప్పటికే అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య వనరులను ప్రజలు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదనే ఒక ముఖ్యమైన లోపాన్ని ఆమె గమనించారు. దీనిపై మరింత స్పష్టత కోసం మజుందర్ ఎన్ఎస్ఆర్సిఇఎల్ (NSRCEL) వారి మహిళా స్టార్టప్ కార్యక్రమంలో చేరారు. ఒక మానసిక ఆరోగ్య వేదికను నిర్మించాలనే ఆలోచనతో ఆమె ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ను ప్రారంభించారు. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి వచ్చింది. దాంతో మానసిక ఆరోగ్యం అనేది బయటి సమస్యగానే కాకుండా ప్రతి ఇంట్లో చర్చించే అంశంగా మారిందని ఆమె అంటారు. కొత్తగా తాను ప్రారంభించిన వేదిక ద్వారా నిపుణులు ఉచిత వర్క్షాప్లు, సెషన్లను అందిస్తుండగా, వాటికి ఎవరు హాజరవుతున్నారో ఆమె నిశితంగా గమనించారు.
అత్యధికులు మహిళలే…
ఆమె ‘ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్’ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఆపదలో ఉన్నవారికి ప్రథమ సహాయం అందించేవారికి శిక్షణ ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 500 మందికి పైగా సర్టిఫికేట్లు పొందారు వీరిలో సుమారు 80-90% మంది మహిళలే. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినపుడు వాటిలో ఎక్కువ మంది మహిళలే పాల్గొన్నారు. ‘మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారో, లేదా సహాయం కోరడానికి ఎక్కువ సుముఖంగా ఉన్నారో.. లేదా రెండూ కావచ్చు’ అని ఆమె అంటారు. ఆమె ఇంకో విషయాన్ని కూడా గ్రహించారు. ‘అంతా బాగానే ఉంది’ అనే భావనకూ, ‘నాకు థెరపీ అవసరం’ అనే భావనకూ మధ్య ఒక దశ ఉంటుందని ఆమె గుర్తించారు. ఆ దశ ఒక సంపూర్ణ శ్రేయస్సు ప్రదేశం. అక్కడ ప్రజలు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవచ్చు, తమ భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు, తమను తాము జాగ్రత్తగా చూసుకోవచ్చు. మహిళలు ఈ దశను తరచుగా విస్మరిస్తారని ఆమె అంటున్నారు.
సంతోషం వైపు మూడు మార్గాలు
2021లో కూర్గ్లో ఒక స్నేహితురాలి కుటుంబానికి చెందిన 100 ఏండ్ల పురాతన హోమ్స్టేలో ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ మొదటి వెల్నెస్ రిట్రీట్కు ప్రారంభమయింది. ఇందులో ఏడుగురు మహిళలు హాజరయ్యారు, వారిలో చాలామంది ఆమెకు వ్యక్తిగతంగా తెలిసినవారే. ఇద్దరు ఆమె అపార్ట్మెంట్ కాంప్లెక్స్కు చెందినవారు, మరికొందరు ఒక స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యారు. నిర్వాహకురాలు సునంద, కళ, రచన, కథల ద్వారా తమను తాము వ్యక్తపరచుకునేలా మార్గనిర్దేశం చేశారు. ఆ మహిళలందరూ తమ తమ రంగాలలో నిష్ణాతులు, తమకంటూ ఒక సామాజిక హోదాను కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూర్గ్లోని ఆ నిరాడంబరమైన హోమ్స్టేలో, వారు తమకే ఆశ్చర్యం కలిగించే రీతిలో మనసు విప్పి మాట్లాడారు. ‘వారికి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి, తమను తాము వ్యక్తపరచుకోవడానికి, పంచుకోవడానికి, కలిసి ఉండటానికి ఒక అవకాశం లభించిందని నాకు అనిపించింది. అది చాలా శక్తివంతమైన అనుభూతి. ఇది కేవలం అప్పుడప్పుడు చేసే ఒక మంచి కార్యక్రమం మాత్రమే కాదని నేను గ్రహించాను. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చు’ అని ఆమె అంటారు.
ఒక కీలక మలుపు
ప్రముఖ నృత్య కళాకారురాలైన త్రిపుర కశ్యప్ రంగప్రవేశంతో ఒక కీలక మలుపు వచ్చింది. వారు కలిసి నిర్వహించిన ఆ రిట్రీట్లో 15 మందికి పైగా పాల్గొన్నారు. ప్రస్తుతం మైండ్ఫుల్లీ సార్టెడ్ సంస్థ గోవా, రిషికేశ్, కూర్గ్, చిక్కమగళూరు, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్లలో వెయ్యికి పైగా మహిళల కోసం 40కి పైగా రిట్రీట్లను నిర్వహిస్తుంది. వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్, ఇమెయిల్ ద్వారా 3,000 మందికి పైగా మహిళలకు విస్తరించింది. త్రిపుర కశ్యప్ ఇప్పటికీ నృత్య, కదలికల తరగతులకు నాయకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ గాయని, సంగీత చికిత్స బోధకురాలైన డాక్టర్ బైశాలి బానర్జీ, సంగీత చికిత్స రిట్రీట్లను నిర్వహిస్తారు. యువ నిర్వాహకురాలైన అనాహిత, ఇటీవల సూఫీ సంగీతం, కవిత్వం, తత్వశాస్త్రం ఆధారంగా రూపొందించిన ‘సూఫియానా’ అనే రిట్రీట్కు నాయకత్వం వహించారు.
సమస్యను అధిగమించాను
క్రియేటివ్ డైరెక్టరైన గరిమా చౌదరి, బెంగళూరు శివార్లలో తన మొదటి ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ రిట్రీట్ కోసం నమోదు చేసుకున్నప్పుడు, ఆమెకు ఒకే ఒక సాధారణ లక్ష్యం ఉండేది. అది కొత్త వ్యక్తులను కలవడం. ‘నేను బెంగళూరుకు కొత్త. రిట్రీట్ తర్వాత కనెక్ట్ అవ్వడానికి నాకు తెలిసిన కొందరు ముఖాలు కావాలని మాత్రమే కోరుకున్నాను. ఇతరులతో మాట్లాడటంలో నాకున్న సంకోచాన్ని అధిగమించడానికి ఈ రిట్రీట్ ఎంతో సహాయపడింది. అంతకంటే ముఖ్యంగా ఇన్నేండ్లుగా నేను సంబంధం కోల్పోయిన వ్యక్తిని అని ఇది నాకు గుర్తు చేసింది. సంభాషణలు, కార్యకలాపాలు, ఆత్మపరిశీలన క్షణాల మధ్య, నేను ఆత్మప్రేమను తిరిగి కనుగొన్నాను. చాలా కాలం తర్వాత మొదటిసారిగా నేను స్వేచ్ఛగా నవ్వాను, ఎక్కువగా ఆలోచించకుండా మాట్లాడాను, నేను నేనుగా ఉన్నాను. ఎలాంటి పోలికలు, తీర్పులు లేకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్న మహిళలతో నిండిన గదిని చూసినప్పుడు, స్వస్థత ఎల్లప్పుడూ గొప్ప క్షణాలలో జరగదని నేను గ్రహించాను’ అంటున్నారు ఆమె.
క్లిష్టమైన సమయంలో
ఒక ఐటీ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న మీనాక్షి వధ్వాకు, ఆమె జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ రిట్రీట్ ఎదురైంది. ఇటీవలే హింసాత్మకమైన వివాహం నుండి బయటపడి, ఆమె కొత్త ఉద్యోగం కోసం బెంగళూరుకు మారింది. ఆమె తన మొదటి రిట్రీట్కు, తమిళనాడులోని యెర్కాడ్లో జరిగిన
‘ఇన్నర్ చైల్డ్ హీలింగ్’ రిట్రీట్కు హాజరయ్యారు. ఇది తన జీవితాన్ని మార్చేసిందని ఆమె అంటు న్నారు. అప్పటి నుండి, ఆమె చిక్కమంగళూరు, రిషికేశ్ వంటి ప్రదేశాలలో జరిగిన మ్యూజిక్ హీలింగ్, డ్యాన్స్ అండ్ మూవ్ మెంట్, ఆర్ట్ థెరపీ రిట్రీట్లతో సహా ఐదు ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ రిట్రీట్లలో పాల్గొన్నారు. గోవాలో
రెండు దిశలలో…
భవిష్యత్తులో మైండ్ఫుల్లీ సార్టెడ్ రెండు దిశలలో అభివృద్ధి చెందాలని మజుందర్ కోరుకుంటున్నారు. మొదటిది కొత్త థీమ్లు, ఫెసిలిటేటర్లు, గమ్యస్థానాలతో తమ ప్రత్యేకమైన మూడు రోజుల రిట్రీట్లను విస్తరించడం. రెండవది మైండ్ఫుల్ నోమాడ్స్, ఇది మహిళలకు ప్రాధాన్యతనిచ్చే ఒక కొత్త ప్రయాణ కార్యక్రమం. ప్రయాణం అనేది లోతైన చికిత్సాత్మకమైనది, ప్రత్యేకించి మార్గమధ్యంలో సహచరులుగా మారే అపరిచితులతో పంచుకున్నప్పుడు అనే నమ్మకంతో ఇది నిర్మించబడింది. ఇతర సాంప్రదాయ సమూహ పర్యటనల వలె కాకుండా, ఇవి స్థానిక సంస్కృతిని, మైండ్ఫుల్నెస్ను, స్వీయ-ఆవిష్కరణను మిళితం చేసి నెమ్మదిగా, లీనమయ్యే ప్రయాణాలు. వారి మొదటి మైండ్ఫుల్ నోమాడ్స్ అనుభవ యాత్ర లడఖ్కు, కేవలం ఒక వాట్సాప్ ప్రకటన ద్వారా జరిగింది. మరో రిట్రీట్కు ప్రణాళిక వేసుకున్నారు. ‘అన్నీ నా తప్పు కాదని నేను గ్రహించాను. అప్పటి వరకు ఎన్నో విషయాల్లో నేను నన్నే నిందించుకున్నాను. ఈ శిబిరం నా చిన్ననాటి గాయాలను గుర్తించడానికి, అవి నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాయో అర్థం చేసుకోవడానికి సహాయపడింది. ఇంకా నాకు పూర్తిగా ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది’ అని ఆమె అంటారు.
ఆమె మానసిక ఆరోగ్యం కోసం
- Advertisement -
- Advertisement -



