ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మాజీ మంత్రులు..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖాత్‌ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్ట్లునారు. దిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్​ నేతలు తిహాడ్‌ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ వెళ్లారు. గతంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే.

Spread the love